తిరుమల శ్రీవారి కి ₹ 1- 30 కోట్ల విరాళలు !

J. SURENDER KUMAR


టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు సోమవారం  తిరుమల శ్రీవారి ఆలయానికి, రూపాయలు కోటి ముప్పది లక్షలు  విరాళంగా అందించారు.


ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ₹.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు  ₹ 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు  ₹ 20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు  ₹ 10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు  ₹ 10 లక్షలు విరాళంగా అందించింది.


అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ₹ 10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ₹ 10 లక్షలు విరాళంగా ఇచ్చింది.


బెంగుళూరుకు చెందిన శ్రీ బీఎంకే నగేష్ అనే భక్తుడు సోమవారం ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు ₹ 30 లక్షలు విరాళంగా అందించారు.


ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి , కదిరి ఎమ్మెల్యే  కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి  వై.రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు.


ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరికి టీటీడీ బోర్డు సభ్యులు  భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా విరాళం డీడీలను అందజేశారు.