J. SURENDER KUMAR
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయానికి, రూపాయలు కోటి ముప్పది లక్షలు విరాళంగా అందించారు.
ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ₹.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ₹ 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు ₹ 20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు ₹ 10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ₹ 10 లక్షలు విరాళంగా అందించింది.

అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ₹ 10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ₹ 10 లక్షలు విరాళంగా ఇచ్చింది.
బెంగుళూరుకు చెందిన శ్రీ బీఎంకే నగేష్ అనే భక్తుడు సోమవారం ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు ₹ 30 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి వై.రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా విరాళం డీడీలను అందజేశారు.