ఏసీబీకి పట్టుబడ్డ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు !

J.SURENDER KUMAR,


శుక్రవారం ఒకే రోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులు చిక్కారు


👉 ఇంచార్జ్ ఎంపీడీవో !


మెదక్ జిల్లాలోని శంకరంపేట (ఎ) మండల ఇంచార్జ్ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి విఠల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.

ఫిర్యాదుధారునికి సీసీ కాలువ నిర్మాణానికి సంబంధించి మంజూరయిన ₹ 1.95   లక్షలు ( లక్ష తొంబై అయిదువేల ఏడువందల నలభై ఏడు వేల రూపాయల)  చెక్కును అందించడానికి”  సహాయం చేసేందుకు అతని నుండి ₹ 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబ‌డ్డాడు.

 
👉 టౌన్ ప్లానింగ్ అధికారి !


సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయములోని సహాయక టౌన్ ప్లానర్ బి. విఠల్ రావును  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారునికి చెందిన రెండు భవనాలకు సంబంధించిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలను అందించడానికి”  సహాయం చేసేందుకు ₹ 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే ₹ 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు.


మిగిలిన ₹ 4 లక్షల రూపాయల కోసం డిమాండ్ చేయ‌డంతో స‌ద‌రు భ‌వ‌న య‌జ‌మాని ఏసీబీకి ఫిర్యాదుదారు చేశారు. దీంతో ఆ లంచ‌గొండి అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది.


👉 పబ్లిక్ ప్రాసిక్యూటర్ , కానిస్టేబుల్ !

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక కేసుకు సంబంధించి విచారణను త్వరగా పూర్తి చేసి, నిర్దోషిగా విడుదల చేయడానికి” కామారెడ్డి‌ లోని సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ – గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్‌లు ₹15,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు ₹10,000/- తగ్గించి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.