👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ పరిధిలో కూరగాయల, మాంసం అమ్మకం దారులకు, కొనుగోలుదారులకు అనుకూలంగా మార్కెట్ ఉండేలా చర్యలు చేపట్టాలని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ధర్మపురి పట్టణంలోని వేజ్ , నాన్ వెజ్ సమీకృత మార్కెట్ సముదాయాన్ని , అమృత్ స్కిం కింద నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ను శనివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

👉 గత ప్రభుత్వ పాలకులు వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ సముదాయాన్ని ₹ 5 కోట్లతో నిర్మాణం చేపట్టాం అని ₹ 3 కోట్లతో షెడ్ లు, ₹ 2 కోట్లతో గద్దెల నిర్మించినట్టు చెప్పిన పాలకులు, మార్కెట్ సముదాయాన్ని ఎంత మంది వినియోగించుకుంటున్నారో ? తెలుసుకోవాలని, ఆరోపించారు.
👉 ఇబ్బందికరంగా మారిన మార్కెట్ లోని సిమెంట్ గద్దెలను తొలగించడానికి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తో చర్చించి పరిస్థితి వివరించినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు అన్నాడు. అధికారులతో చర్చించి, ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా గద్దె లు కూల్చాలని వివరించినట్టు తెలిపారు.
👉 గత పాలకుల ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు అని ఆరోపించారు.
👉 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం త్రాగు నీటి కోసం ₹ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు ప్రభుత్వంలో పాలకులు త్రాగు నీటి సరఫరా గురించి శాశ్వత పరిష్కారం చూపలేదని, ఈ ప్రాంత ప్రజలుత్రాగు నీటి కొరకు డబ్బా నీటిపై ఆధారపడాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయంగా బోల్ చెరువు నుండి నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టేమని ఎమ్మెల్యే అన్నారు.
👉 అమృత్ పథకం ద్వారా జ్వరం పై పటానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 చలివేంద్రాలు ప్రారంభం !

పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ధారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని , స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో

తోట సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శంకర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.