👉 మాడిఫైడ్ మోటార్ సైకిల్ సైలెన్సర్స్ ద్వంసం చేసిన జగిత్యాల్ పోలీసులు !
👉 సైలెన్సర్ లు మార్పు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఎస్పి అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజలకు శబ్ద కాలుష్యంతో పాటు, ఇబ్బందులకు గురి చేస్తున్న మాడిఫైడ్ మోటార్ సైకిల్ సైలెన్సర్ల పై జగిత్యాల జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. దాదాపు 130 మోటార్ సైకిల్ సైలెన్సర్ లను ధ్వంసం చేశారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి
శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల పై పోలీసులు కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించారు.
సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న 130 వాహనాల సైలెన్సెర్స్ లను ఎస్పి అశోక్ కుమార్ పర్యవేక్షణ లో గురువారం రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు.
👉 ఈ సందర్బంగా ఎస్పి అశోక్ కుమార్ మాట్లాడుతూ..
నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యం పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.
మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయొచ్చు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్ను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.

జిల్లా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ ,ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.