J.SURENDER KUMAR,
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జీ. ప్రియదర్శిని మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
జస్టిస్ ప్రియదర్శిని న్యాయ రంగంలో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.