👉 వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది !
👉 కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు !
J.SURENDER KUMAR,
కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ
దయ్యాలు ఉన్నాయి వారి వల్ల పార్టీకి
నష్టం జరుగుతోంది కేసీఆర్ కూతురైన
నేను రాసిన లేఖ నే బయటికి వచ్చిందటే
పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి ?
అంటూ కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత
సంచలన వ్యాఖ్యలు చేశారు ..
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.
👉 ఎమ్మెల్సీ కవిత మాటల్లో…
నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్లు తెలిసింది రెండు వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాయడం జరిగింది.


👉 గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగింది కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పాను !
👉 ఇప్పుడు లేఖ బహీర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది !
👉 పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను !
👉 ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు
వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు !
👉 మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహీర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది !
👉 కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి ? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది !
👉 నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు లేఖ బహీర్గతం కావడం బాధాకరం !
👉 లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి !
👉 బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు మా నాయకుడు కేసీఆర్ యే.!
👉 కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా మందుకెళ్తుంది పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది !

👉 కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి… వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం. !