మంత్రి శ్రీధర్ బాబును కలిసిన సి ఎస్ రామకృష్ణారావు !

J.SURENDER KUMAR,

డా.బీఆర్  అంబేద్కర్ సచివాలయంలో  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.


ఈ సంద‌ర్భంగా సీఎస్‌ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌భుత్వ ప్రాథ‌మ్యాల‌కు అనుగుణంగా పనిచేసేలా రాష్ట్ర యంత్రాంగాన్ని ముందుకు న‌డిపించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హామీలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అర్హులంద‌రికీ చేర్చేలా ముందుకెళ్లాల‌ని సీఎస్‌ సూచించారు.