👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నా రాజకీయ ప్రస్థానంలో గెలిచిన, ఓడిన మంత్రి శ్రీధర్ బాబు నాకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మన ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం, సమస్యల సాధన కోసం నిత్యం ప్రజల్లో ముమైకమే ఉండాలంటూ, ప్రోత్సహిస్తూ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించినా ,అందిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు రుణం తీర్చుకోలేనిది అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంథని పట్టణంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటరి రాజు ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చారు, నృత్యాలు చేశారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలన్నారు.
మంథని నియోజకవర్గానికి శ్రీధర్ బాబు నాయకత్వంలో మహర్దశ పట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల స్థాపన, ఆరోగ్య సేవల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంథనిని అభివృద్ధికి చిరునామాగా మార్చాయని కొనియాడారు.
పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మంథని ఆర్ధిక వృద్ధికి బాటలు వేశారు. పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ గా నిలవడంలో మంత్రి శ్రీధర్ బాబు పాత్రకి కీలకమని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు బాటలో నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న శ్రీధర్ బాబు, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా, తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలలో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు శాసనసభ వ్యవహారాలను చక్కబెట్టడంలో మంత్రి శ్రీధర్ బాబు దిట్ట గా ప్రతిపక్షాలు, ప్రజానీకం మెచ్చిన నాయకుడు గా గుర్తింపు సంపాదించుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు..