నేడు శ్రీ నృసింహ జయంతి !

J.SURENDER KUMAR ,


ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి  నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం  శ్రీ నృసింహ జయంతి  ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది.


తెల్లవారుజామున  వేద పండితులు, అర్చకులు, చే శ్రీ స్వామివారికి పురుష సూక్త, శ్రీ సూక్త , కల్పోక్త న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో మరియు మాన్యసూక్తంతో మరియు రుద్రాభిషేకం, పూజలు పంచోపనిషత్తులతో శ్రీ స్వామివారికి అభిషేకం,  విశేష పూజలు  నిర్వహించనున్నారు.


అనంతరం సప్త హారతులు మరియు వేద మంత్రపుష్పములు,  చతుర్వేద అవదార్యములు జరగనున్నాయి.


👉 సాయంత్రం 6 గంటలకు శ్రీస్వామి వారి స్తంబోధ్బవ  సమయంలో స్వామివారికి విశేష పూజలు  జరగనున్నాయి
.