నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి !

J.SURENDER KUMAR,


తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏట వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహించారు. శ్రీ యోగ నరసింహస్వామి వారి మూల మూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు.

👉 ఆలయ ప్రాశస్త్యం:

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామి వారి, ఉప ఆలయం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు.

స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యులు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.