పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


మారుమూల అటవీ గ్రామ ప్రాంతాల నుండి వైద్యం కోసం వచ్చే బడుగు బలహీన వర్గాల పేదలకు వైద్య సేవలు అందించి ఆస్పత్రి వైద్యులు, నిర్వాహకులు వారి ప్రేమ అభిమానాలు పొందాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


మంథని నియోజకవర్గం  కాటారం మండల కేంద్రంలో ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు మోత్కురి శ్రీనివాస్ కు చెందిన నూతన సంజీవని హాస్పిటల్ నీ ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.