పుష్కర స్నానం చేసిన హైకోర్టు న్యాయమూర్తి దంపతులు !

J.SURENDER KUMAR,

కాలేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానం ఆచరించిన హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నరసింగారావు. కాళేశ్వరం పుష్కర స్నానానికి, దర్శనానికి సోమవారం సతీసమేతంగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నరసింగారావు గ సోమవారం పుణ్యస్నానం ఆచరించారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లాకు చెందిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి అఖిల, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,  చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి అనితవాని, పి.డి.ఎం. కోర్టు సూపరింటెండెంట్ వీ. సదానందం, కోర్టు సిబ్బంది, న్యాయమూర్తి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ న్యాయమూర్తి దంపతులకు
సరస్వతి మాత చిత్రపటాన్ని అందజేశారు.