👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,

విశ్వగురు శ్రీ బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

👉 అనంతరం మాట్లాడుతూ, బసవన్న స్ఫూర్తితోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టామని అన్నారు. బసవేశ్వరుడు సామాజిక న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేశారని విశ్వగురు విధానాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

👉 బసవన్న స్ఫూర్తి సందేశానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, వారి సందేశమే పరిపాలనకు సూచిక అని అన్నారు. పేదలకు న్యాయం జరగాలని ఆనాడు అనుభవ మంటపాల ద్వారా తెలుసుకున్న విశ్వ గురు ఆదర్శంగానే ప్రస్తుతం పార్లమెంట్, శాసనసభలు జరుపుకుంటున్నామని వివరించారు.

👉 విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ , కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
👉 నూతన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభం !

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచునూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవన ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయమని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పలువురు విద్యార్థుల వద్దకెళ్లి వారితో కరచాలనం చేస్తూ వెన్నుతట్టారు.