తిరుమల శ్రీవారికి ₹ 1.40 కోట్ల భక్తుడి విరాళం !


J.SURENDER KUMAR,

అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం తిరుమల తిరుపతి దేవస్థానంలోని  వివిధ ట్రస్టులకు ₹ 1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు.

తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందించారు.

👉 విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి !


👉ఎస్వీ ప్రాణదాన  ట్రస్ట్‌కు,₹ 1,00,01,116.


👉 ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు. ₹ 10,01,116,


👉 ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌కు ₹ 10,01,116, 


👉 ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు,₹ 10,01,116, 


👉 ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు ₹10,01,116.


టిటిడిలోని వివిధ ట్రస్ట్ లకు విరాళాలు అందించిన దాతను టిటిడి ఛైర్మన్  బీఆర్ నాయుడు అభినందించారు.