వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం !

J.SURENDER KUMAR,


ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి  నవరాత్రోత్సవములలో గురువారం వైభవంగా శ్రీ స్వామివారి చందనోత్సవ కార్యక్రమము వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.


  ఉదయం శ్రీస్వామి వారికి పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, నహాన్రనామార్చన, వంచోవనిషత్తులతో మరియు మన్యనూక్తముత్మోరియు రుద్రాభిషేకము పూజలు, విశేష పూజలు, సప్త హారతులు, భజన కార్యరకమములు జరిగాయి.


చందనముతో శ్రీ యోగ, ఉగ్ర నర్సింహస్వామి వార్లను అలంకరించారు.


భారీ సంఖ్యలో  భక్తులు శ్రీ స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు శ్రీస్వామి వార్ల తీర్థప్రసాద వితరణ చేయనైనది.

ఆలయ వేదపండితులు, అర్చకులు బొజ్జ రమేష్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు నంబి నర్సింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ, చక్రపాణి కిరణ్,

అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, పాలకవర్గ అధ్యక్షులు శ జె. రవీందర్, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.