J.SURENDER KUMAR,
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు.

మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ను అభినందించిన
మాజీ మంత్రి రవీందర్ నాయక్ !
మాజీ MP మరియు గిరిజన శాఖ మాజీ మంత్రి రవీంద్ర నాయక్ శుక్రవారం గిరిజన సంఘాల వారితో

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.