సీఎం రేవంత్ రెడ్డిని  కలసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ !

J.SURENDER KUMAR,

ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుdu పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న నేపథ్యంలో మంద కృష్ణ  తమ ఆనందాన్ని ముఖ్యమంత్రి తో పంచుకున్నారు.


సామాజిక న్యాయం కోసం మంద కృష్ణ మాదిగ  చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా మరోసారి ప్రశంసించారు.