👉 బుగ్గారంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో...
J.SURENDER KUMAR,
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నదని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రం లో పోచమ్మ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాలను, మరియు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కుల అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు.
👉 ఈసందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్
మాట్లాడుతూ …

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు సత్వరమే నిర్మాణాలు పూర్తి చేయాలని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని వివరించారు. అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇండ్ల మంజూరు చేశామని తెలిపారు. విడతల వారీగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.
👉 జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ…

ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని, వారు ఆన్లైన్లో నిర్మాణ దశను తెలియజేసి ప్రభుత్వం నుండి బిల్లులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు 191 అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. కల్యాణ లక్ష్మి 17 చెక్కులు ₹ 1,1997 లక్ష ఒకవైతొమ్మిది వందల తొంబై ఏడూ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవిన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ హౌసింగ్ పీడీ ప్రసాద్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు