👉 2 లక్షల48 వేల 550 మంది రైతుల ఖాతాలోకి !
👉 ఎకరానికి ₹ 6 వెల చొప్పున 4.18 లక్షల ఎకరాలకు ₹ 251.14 కోట్ల నిధులు ఖాతాలోకి!
J.SURENDER KUMAR
జగిత్యాల జిల్లాలో రైతుభరోసా పథకం పెట్టుబడి సాయం నిధుల సోమవారం సైతం రైతుల ఖాతాలో జమ అయ్యాయి.ఇప్పటి వరకు 221994 మంది రైతులకు ₹ 237.71 కోట్ల నిధులు వచ్చాయని జిల్లా వయసాయ అధికారి వి. భాస్కర్ తెలిపారు.
జిల్లాలోని మొత్తం 2,48,550 మంది రైతులు, 4.18 లక్షల ఎకరాలకు చెంది ఎకరాకు ₹ 6 వెల చొప్పున ₹ 251.14 కోట్ల నిధులు రావలసి ఉందన్నారు.
మిగిలిన రైతులకు నిధుల విడుదల కొనసాగుతుందని వివరించారు.
👉 రేపు రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ !

జగిత్యాల జిల్లాలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం 4-30 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా లో 52 రైతు వేదిక లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.
రైతు వేదికల వద్దకు నిర్ణీత సమయంలో రైతులు పాల్గొనవలసిందిగా జిల్లా వయసాయ అధికారి వి. భాస్కర్ ప్రకటనలో కోరారు.