మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్  తేనీటి విందు !

J.SURENDER KUMAR,


మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాట చుంగ్‌సీ తో పాటు ఇతర కేటగిరీల విజేతలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి  హాజరయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి  సత్కరించారు.


ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వైభవం తమను ఎంతో ఆకట్టుకున్నదని, తెలంగాణను చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.