ఫోన్ ట్యాపింగ్ కేసు లో  కేంద్రమంత్రికి సిట్ నోటీసు ?


J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో  పెను సంచలనం సృష్టించనున్న ఫోన్ టాపింగ్ కేసు. విచారణ అధికారులు శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులిచ్చేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు.

ఈ మేరకు శుక్రవారం రాత్రికొద్దిసేపటి  కేంద్ర మంత్రికి ఫోన్ చేసి  సిట్ అధికారులు వివరించి విచారణకు హాజరు కావలసిందిగా కోరినట్టు సమాచారం.

మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కి  అధికారులు వివరించినట్టు తెలిసింది.

కేంద్ర మంత్రి వాంగ్మూలం నమోదుకు సమయం కోరినట్టు సమాచారం. షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానన్న కేంద్ర మంత్రి రేపో మాపో నోటీసులు జారీ చేయనున్న విచారణ అధికారులు.

👉 వివరాల్లోకి వెళితే..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్ !

బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)

👉 కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు ఆరోపించిన బండి సంజయ్ !

👉 కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది, ప్రదాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్న సంజయ్!

👉 కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన సంజయ్!

👉 బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు బండి సంజయ్ తోపాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేసిన గత ప్రభుత్వం !

👉 ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేసిన పోలీసులు !

👉 కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డ పోలీసులు !

👉 రాజకీయంగా  ఎదుర్కోలేక ఫోన్ ట్యాప్ తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్  కుట్ర చేస్తున్నారని పలుమార్లు సభల్లో, మీడియా వేదికల ద్వారా ఆరోపించిన బండి సంజయ్!

👉 భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసి నీచానికి ఒడిగట్టిందన్న సంజయ్ !

👉 బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనంటున్న సిట్ వర్గాలు !

👉 వందలాది మంది ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్దారణ !

👉 సాక్షిగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునేందుకు సిద్ధమైన పోలీసులు !

👉 బండి సంజయ్ వాంగ్మూలంపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి !