వైకల్యాలున్న మనోధైర్యం తో విద్యకు  ప్రాధాన్యత ఇవ్వాలి !

👉🏻 వికలాంగుల జీవితాలను మార్చడానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి హెలెన్ కెల్లార్ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వైకల్యాలున్న ఉన్న మనోధైర్యం కోల్పోకుండా  మొట్టమొదట విద్య కు ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని  ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హెలెన్ కెల్లార్ 145 వ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం  హైదరాబాద్ మలక్ పేట నల్గొండ X రోడ్ వద్దగల దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జండర్ వ్యక్తుల సాధికారత శాఖ వారి ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన  వేడుకల్లో ముఖ్య అతిథిగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హెలెన్ కెల్లార్  విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి,అనంతరం  విద్యార్థులతో కలిసి మంత్రి భోంచేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

హెలెన్ కెల్లర్  145 జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, చెవిటి మరియు అంధురాలు అయిన గొప్ప అమెరికన్ మహిళ హెలెన్ ఆడమ్స్ కెల్లర్  జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి  ఆమెను గౌరవించుకోవడానికి ప్రతి సంవత్సరం జూన్ 27న హెలెన్ కెల్లర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని, మంత్రి అన్నారు.

హెలెన్ కెల్లర్ కు వైకల్యాలు ఉన్నప్పటికీ  ప్రసిద్ధ రచయిత్రి గా, రాజకీయ కార్యకర్త గా, మరియు లెక్చరర్ అయ్యారనీ  ఆమె జీవితం ప్రపంచవ్యాప్తంగా  కోట్లాదిమందికి స్పూర్తిదాయకమని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఆమె ఎదుర్కొన్న పోరాటాలు మరియు ధైర్యం, సంకల్పం మరియు ఆమె గురువు అన్నే సుల్లివన్ మద్దతు ద్వారా ఆమె సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మంత్రి అన్నారు.

హెలెన్ కెల్లర్  వికలాంగుల జీవితాలను మార్చడానికి ఎంతో కృషి చేశారనీ, ఆమె సమాజంలో మార్పు కోసం, ముఖ్యంగా వికలాంగుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని,ఆమె మహిళా ఓటు హక్కు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, ఆమె సేవా స్ఫూర్తిని మరియు న్యాయవాద స్ఫూర్తిని  అవసరంలో ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా వైకల్యాలతో జీవిస్తున్న వారికి అండగా ప్రతి ఒక్కరూ ఉండాలని, ఆమె ప్రపంచ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందనీ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.