గిరిజనుల సమస్యలు చర్చించడానికి సమావేశం !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ఐదు సంవత్సరాల తర్వాత గిరిజను ల సమస్యలు చర్చించడానికి సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్నీ పూర్తిగా విస్మరించింది అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, అన్నారు.



హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సోమవారం  మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 7 వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం  జరిగింది.

ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, ఆదివాసి గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ట్రైకార్ చైర్మన్, బెల్లయ్య నాయక్,  స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

👉 మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

గత ప్రభుత్వం వల్ల గిరిజనుల సంక్షేమలో ఎన్నో లోసుగులు ఉన్నాయి మీ సలహాలు సూచనలు ఇవ్వండి,గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కి మీ సలహాలు, సూచనలను నివేదించి న్యాయం చేస్తాం,  గిరిజనుల బడ్జెట్ నిధులు వారికే ఖర్చు చేయాలి, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసే పనులకు బిల్లులను సకాలంలో చెల్లిస్తాం అనే మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కావు అన్నారు.

👉 గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి,గతంలో మాదిరిగా నిధులను పక్కదారి పట్టించవద్దు  పనులు చేపట్టడానికి కాంట్రాక్టులు రావడంలేదని ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించవద్దు. తొలిమంత్రి ఎలక్షన్ కుమార్ అధికారులను ఆదేశించారు.

👉 మంత్రి సీతక్క మాట్లాడుతూ..

👉 గిరిజన సంక్షేమ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నము గత ప్రభుత్వము ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్క దారి పట్టించింది,ఆదివాసి గిరిజన ప్రాంతాలకు రోడ్లు బ్రిడ్జిలు అవసరం కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడం వల్ల గర్భిణి ప్రసవవేదన వంటి వార్తలు వస్తున్నాయి మంత్రి సీతక్క అన్నారు.

👉 ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దు,ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికి ఖర్చు చేయాలి. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దు అన్నారు.

👉 సబ్ ప్లాన్ నిధులను పక్క దారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనకబాటులోనే మగ్గిపోతుంది, అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారికి ఖర్చు చేయాలి ఎస్టీల్లో ఎక్కువమందికి ఉండటానికి ఇండ్లు లేవు,కాబట్టి ఎస్టీ ల ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు.

👉 ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలని డిమాండ్ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరిస్తాం అని మంత్రి సీతక్క అన్నారు.