👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జగిత్యాల జిల్లాలోని మండలాల అధికారులకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు.
ఇండ్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాల పనులు లను ప్రారంభించేలా అధికారులకు ఆదేశించారు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని అన్ని మండలాల లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను మండల స్పెషల్ ఆఫీసర్లు క్లస్టర్ ఆఫీసర్లు అధికారులు సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో దిరమ్మ ఇళ్లు మంజూరు అయినా లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయిన లబ్దిదారులను కలిసి, వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు.
నిర్దేశిత గడువు లోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు.
ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను ఇంటి నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకురావాలని నిర్మాణాలను పనులను వేగంగా పూర్తి చేసుకోవాలని, వివిధ దశలను అనుసరిస్తూ వెంటదివెంట డబ్బులను ఖాతాలో జమ చేయిస్తామని అధికారులకు ఆదేశించారు

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత,, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి,రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్ డిపిఓ మదన్ మోహన్ ఎంపీడీవోలు హౌసింగ్ డి ఈ. భాస్కర్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు