👉 పుష్కరాల వరకు ధర్మపురి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతా!
👉 రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక దృష్టి సారించండి
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
2027 సంవత్సరంలో ధర్మపురి క్షేత్రంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, వీటిని అద్భుతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని, పుష్కరాల్లో భాగంగా ఇప్పటినుంచే ధర్మపురి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రివ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో ఎమ్మెల్సీ రమణ, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్,కే సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.
సమావేశంలో సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యము, వ్యవసాయము పౌరసరఫరాలు,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ శాఖ,రోడ్లు భవనాల శాఖ, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధితోపాటు వివిధ అంశాలపై సమీక్షించారు.
👉 ఈ సందర్భంగ మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
ధర్మపురిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, జిల్లాలో అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే జీవిస్తున్నారని, రైతులకు సాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇరిగేష అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

తాగునీటి విషయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని,వ్యవసాయ సీజన్ కాబట్టి గ్రామాల్లో యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని, అధికారులు సహకరించాలని , అధికారులు బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తూ పేదలకు అండగా నిలవాలని మంత్రి కోరారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, అభివృద్ధి విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ప్రభుత్వపరంగా జిల్లా అభివృద్ధికి ఏ విధంగా మేలు జరుగుతుందని అంశంలో తను ఎల్లప్పుడూ ముందుంటానని, ఆ విధంగా ఆలోచించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేస్తానని, గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో తన శాఖకు వన్నెతెచ్చే విధంగా పనిచేస్తానని, మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు
జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, జగిత్యాల లో నూతన డిగ్రీ కాలేజ్, స్టడీ సర్కిల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని, జిల్లాలో ప్రభుత్వ పథకాలు వందకు 100% అమలు చేయడంలో అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిబంధనల మేరకు పనిచేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రుల కుమార్ అన్నారు.