👉 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం !
👉 మహిళలను అన్ని రంగాలలో బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమం లో..
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో మహిళలను ఆర్థిక మహారాణులుగా చేయడం కోసం స్వయం సహాయక సంఘాలకు సాధికారత కల్పించడానికి, అన్నీ జీవనోపాధి అంశాలలో మహిళలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని, అదే విధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వం లక్ష్యంగా వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండలం రాజారాంపల్లె లోనీ SR గార్డెన్ లో శనివారం ప్రభుత్వం పక్షాన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తో కలిసి పాల్గోన్నారు.
👉 ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ రాయితీ కింద 4 వేల 683 స్వశక్తి సంఘాలకు ₹ 5 కోట్ల 70 లక్షల రూపాయల చెక్కులను, స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 40 పట్టణ మహిళా పొదుపు సంఘాలకు ₹ 32 లక్షల రూపాయల చెక్కులను, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా 10 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి, నూతనంగా మహిళా సంఘాలకు మంజూరు అయినా 5ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ..
మహిళా జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని, మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం తో పాటు లోన్ బీమా, ప్రమాద బీమా, వంటి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.

👉 మహిళల ఆదాయం పెంచెందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం, ఇందిరా శక్తి క్యాంటీన్, ఆర్టిసికు అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలకు శ్రీకారం చుట్టినట్టు మంత్రి తెలిపారు.
👉 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వంటి వివిధ వ్యాపారాలు చేయడం వల్ల నెలకు మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆర్టిసి కు పెట్టిన అద్దె బస్సు ద్వారా నెలకు ₹ 70 వేల రూపాయల ఇస్తున్నామని, మహిళా సంఘాలు వారికి అందే రుణాలతో చిరు వ్యాపారాలను ప్రారంభించాలని మంత్రి కోరారు.

👉 మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ₹10 లక్షల రూపాయల అందిస్తున్నామని, మహిళ సభ్యులు సాధారణంగా మరణిస్తే ₹ 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా అమలు అవుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌళిక వసతుల ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారికి పనులను కేటాయించడం జరిగిందనీ అన్నారు.

👉 127 ప్రభుత్వ స్కూళ్ళలో మరమ్మతులు చేయించడం జరిగిందని, ధర్మపురి నియోజకవర్గం కు 5 కొత్త బస్సులు ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం కు మంజూరు అయినట్లు మంత్రితెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు,మహిళా సంఘాల సభ్యులు,అధికారులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.