👉 ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రతి సభ్యురాలికి ప్రమాద బీమా, లోన్ బీమా కల్పించామని, ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు ₹10 లక్షల పరిహారం అందుతుందని, సహజ మరణం పొందితే ఆ సభ్యురాలు పేరిట ఉన్న రుణం గరిష్టంగా ₹ 2 లక్షల వరకు మాఫీ అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

గురువారం జిల్లాలో మున్సిపల్ పార్క్ ఎదురుగా ఆనంద్ భవన్ టౌన్ హాల్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గోన్నారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ...

ఏకరూప దుస్తులు కుట్టడం ద్వారా జిల్లాలో 134 మహిళలకు నూతన కుటీర వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేశామని దీని ద్వారా వీరు 7 లక్షల 94 వేల రూపాయల ఆదాయం పొందినట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు పెట్టామని అన్నారు.
జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద వెయ్యి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని, అదే విధంగా జగిత్యాల మండలం చల్ గల్ గ్రామంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
👉 ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ…

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు సాధికారత కల్పించడానికి, అన్నీ జీవనోపాధి అంశాలలో మహిళలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే విధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా వివిధ రకాల కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ మాఫీ కింద 2 వేల 670 స్వశక్తి సంఘాలకు ₹ 3 కోట్ల 11 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాల కింద 123 సంఘాలకు ₹ 17 కోట్ల రూపాయలను, స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 25 పట్టణ మహిళా పొదుపు సంఘాలకు ₹ 17 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు.

మహిళల ఆదాయం పెంచెందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం, ఇందిరా శక్తి క్యాంటీన్, ఆర్టిసి కు అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వంటి వివిధ వ్యాపారాలు చేయడం వల్ల నెలకు మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఆర్టిసి కు పెట్టిన అద్దె బస్సు ద్వారా నెలకు ₹ 70 వేల రూపాయల ఇస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలు వారికి అందే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని తెలిపారు.

మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ₹ 10 లక్షల రూపాయల అందిస్తున్నామని అన్నారు. మహిళ సభ్యులు సాధారణంగా మరణిస్తే ₹ 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా అమలు అవుతుందని అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌళిక వసతుల ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారికి పనులను కేటాయించడం జరిగింది. 138 ప్రభుత్వ స్కూళ్ళలో ₹ 2 కోట్ల 53 లక్షల నిధులతో మరమ్మతులు చేయించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గం కు 3 కొత్త బస్సులు బీర్ పూర్, సారంగాపూర్, రాయికల్ కు మంజూరు అయినట్లు తెలిపారు.
కార్యక్రమంలో డిఆర్డిఓ రఘువరన్, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.