పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి !

👉10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు  అందించడానికి ప్రభుత్వం కృషి కృషి చేస్తున్నదని, తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నదని
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెగడపెల్లి మండల కేంద్రంలో శనివారం  రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు.

పెగడపెల్లి మండలానికి  మంజూరు అయిన 1079 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం 62 లక్షల రూపాయలు విలువ గల 62 కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……

ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని,  రేషన్ కార్డు రాని వారు కంగారు పడాల్సిన అవసరం లేదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీసేవాలో కానీ.. లేదంటే ప్రజాపాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు.


ప్రభుత్వ ధాన్యం,నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించేందుకు ఈ కార్డులు కీలకం కానున్నాయనీ, తద్వారా మరిన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల నుండి లబ్ధిపొందే అవకాశం కలుగనుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు  కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, DRDO రఘువరన్, ఎంపిడిఒలు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.