J.SURENDER KUMAR,
రేషన్ కార్డు రాని అర్హులైన వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, కార్డు రాని వారు మీ సేవాలో కానీ, లేదా, ప్రజాపాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలంలో పోచమ్మ ఫంక్షన్ హాల్ లో గురువారం అర్హులైన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఇదే వేదికపై 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …

రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఇప్పటికే ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందని కార్డులు ఇప్పుడు వారికి రేషన్ కార్డులు రానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంత్రి అన్నారు. ప్రభుత్వ బియ్యం, నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించేందుకు ఈ కార్డులు కీలకం కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ దిశగా చేసిన మరో గొప్ప అడుగు అని పలువురు పేర్కొంటున్నారు. తద్వారా మరిన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల నుండి లబ్ధిపొందే అవకాశం కలుగనున్నదని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సుధన్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, డి ఎస్ ఓ జితేందర్ రెడ్డి, మండల తహసిల్దార్ , ఎంపీడీవో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.