తిరుమలలో పోటెత్తిన భక్తజనం శిలా తోరణం వరకు క్యూ లైన్ !

J.SURENDER KUMAR,

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తరలివచ్చిన భక్తజనంతో బుధవారం తిరుమల కొండ పోటెత్తింది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తజనం తో భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది.

👉 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు .

👉 బుధవారం  ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 22  గంటల సమయం పడుతుంది.!


👉  ₹ 300 శీఘ్రదర్శనంకు  3-5  గంటల సమయం పడుతుంది.

👉  సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5–7 గంటల సమయం పడుతుంది.

👉  మంగళవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,020

👉 27,609  మంది భక్తులు మంగళవారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

👉 మంగళవారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.19 కోట్లు .