J.SURENDER KUMAR,
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తరలివచ్చిన భక్తజనంతో బుధవారం తిరుమల కొండ పోటెత్తింది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తజనం తో భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది.

👉 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు .
👉 బుధవారం ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 22 గంటల సమయం పడుతుంది.!
👉 ₹ 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5–7 గంటల సమయం పడుతుంది.
👉 మంగళవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,020

👉 27,609 మంది భక్తులు మంగళవారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉 మంగళవారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.19 కోట్లు .