ఆడపడుచుల ఆనందమే మా ప్రభుత్వ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి !

👉 రాఖీ పండుగ సందర్భంగా….

J.SURENDER KUMAR,

ప్రేమ ఆప్యాయలతో అన్నా చెల్లెళ్ల బంధం మరింత బలపడాలని కోరుకుంటూ, ఆడపడుచుల జీవితాల్లో ఆనందమే ఆ ప్రభుత్వ లక్ష్యమని పవిత్ర రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శుభదినం రోజున అందరి ఇళ్లలో ఆనందం, ఆరోగ్యంతో గడపాలని ఆకాంక్షించారు.

👉 ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళాభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  గుర్తుచేశారు.


👉 ఆడబిడ్డల కోసం గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. 

👉 మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడబోమని అన్నారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో  విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.