భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలుపాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని నిలుపాల‌ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామ‌ని తెలిపారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్‌లోని  నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

👉 సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి  అభినందనలు తెలియజేశారు.

👉 అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి , హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంకట్ , శ్రీనివాస్ , టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు , పృథ్వీ, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ , సింగర్ రోహిత్ లను  ముఖ్యమంత్రి  సన్మానించారు.

👉 కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి , బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్ , భగవంత్ కేసరి, నిర్మాత గారపాటి సాహు తో పాటు ఇతరులు పాల్గొన్నారు.