సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పండుగ సందడి !

J.SURENDER KUMAR,

రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సందడి నెలకొంది. మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావడంతో రాఖీ పండుగ కోలాహళంగా సాగింది.

👉 మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క  ముఖ్యమంత్రి కి రాఖీ కట్టారు. మాజీ మంత్రి డాక్టర్ గీతా రెడ్డి  ముఖ్యమంత్రి కి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వీరితో పాటు పలువురు సోదరీమణులు రాఖీ కట్టారు.


👉 ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మకుమారీస్  సోదరీమణులు ముఖ్యమంత్రిని కలిసి రాఖీ కట్టారు. మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి ని కలిసి రాఖీ కట్టారు.


👉 మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద , వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత , బీసీ కమిషన్, విద్యా కమిషన్, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్, రైతు కమిషన్ కు చెందిన మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తో పాటు మహిళా ప్రతినిధులు రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.