ఎంపీడీవో నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి  లక్ష్మణ్ కుమార్ !

J . SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ పరిధి లోని ఎండపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమైన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని (ఎంపీడీవో) రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ  వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

ప్రజల పాలనకు మరింత చేరువగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు నూతన కార్యాలయం ఉపయోగపడుతుందని. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి అన్నారు.

👉  సింగిల్ విండో భవనం ప్రారంభం !


ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.