J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్ లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యతిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ముందుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పోలీసుల గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు.
అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి తిలకించి వివరాలను తెలుసుకున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్థులు దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.

ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి, లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వేడుకలల్లో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదనపు కలెక్టర్ బి. ఎస్ లత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధర్మపురి పట్టణంలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉందని, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.