ప్రజావాణి అర్జీలకు పరిష్కార మార్గం చూపాలి !

👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !

J.SURENDER KUMAR,

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను   అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓలతో తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. 

👉 ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ…


సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.


అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 40 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజావాణిలో  జగిత్యాల, కోరుట్ల,  ఆర్డీఓలు మధు సుధన్, జివాకర్ రెడ్డి,  డి ఆర్ డి ఓ  రఘు వరన్, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.