👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, చేసిన త్యాగాలు కీలకం, చిరస్మరణీయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆదివారం మంత్రులు, పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మందుల సామెల్ , వైస్ చాన్సలర్ ఎం. కుమార్ ,ప్రొఫెసర్ కాసిం లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థుల సంక్షేమ వసతి గృహం ప్రారంభోత్సవానికి రావలసిందిగా వీరు సీఎంను ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎస్.టీ. హాస్టల్ ప్రారంభంతో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు లభించనున్నాయని సీఎం అన్నారు.