👉 గోదావరి నది ఉధృతితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి !
👉 ప్రభుత్వ యంత్రాంగం అనుక్షణం అందుబాటులో ఉండాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించవద్దని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులకు సూచనలు చేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా గురువారం ధర్మపురి గోదావరి నది, మండలంలోని నేరెళ్లలో జగిత్యాల మండలం అనంతారం బ్రిడ్జి రాయికల్ మండలం రామోజీపేట బ్రిడ్జి ,ఇటిక్యాలలో లోలెవెల్ బ్రిడ్జి ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …

అధికార యంత్రాంగం ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అని, సమస్యల పట్ల సత్వరమే స్పందించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని,ముందు జాగ్రత్తగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ ఆర్ ఎస్ పి )నుండి 39 గేట్లు కడెం ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని వదిలారనీ, గోదావరి నది భారీగా నీటి ప్రవాహం వస్తున్నందున గోదావరి నది తీర ప్రాంతాలలో లోతంటూ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ సూచనలు చేశారు.

ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్ ఆర్ ఎస్ పి. మరియు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున గోదావరిలో భారీగా వరద వస్తున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో తో కలిసి మంత్రి గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.

గత 15 రోజులుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వరదల పై రాష్ట్రంలోని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించడం జరిగిందని, ప్రజలు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు, పోలీసులు అందుబాటులో ఉంటారని, అధికారులకు కూడా తీర ప్రాంత ప్రజలు సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
ప్రజలంతా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా అధికారులను తమను సంప్రదించవచ్చని తెలిపారు. మంత్రి పర్యటనలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీవో తహసీల్దారులు, పోలీస్ సిబ్బంది సిఐఎస్ఐ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.