ఐదు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి !

👉 మావోయిస్ట్  తూర్పు ప్రాంతీయ బ్యూరోప్రతినిధి సంకేత్‌ !

J SURENDER KUMAR,

ఆపరేషన్ కాగర్’ పేరిట సాగుతున్న క్రూర ఫాసిస్ట్ పోలీసు అణచివేతకు వ్యతిరేకంగా బీహార్-జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో అక్టోబర్ 8 నుంచి 14 వరకు ప్రతిఘటన వారం, అక్టోబర్ 15, ఒక రోజు బంద్‌కు
మావోయిస్ట్ తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సంకేత్‌ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.

ఆదివాసీ, దళిత, కార్మిక వర్గ వర్గాలకు చెందిన సాధారణ పోలీసు సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది క్రూరమైన పోలీసు అధికారుల సూచనల మేరకు చట్టం, మానవ హక్కులను ఉల్లంఘించే ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడకుండా నిరసన తెలియజేయాలని బ్యూరో విజ్ఞప్తి చేస్తుంది.

👉పాల వ్యాన్లు, ప్రెస్ వ్యాన్లు మరియు రోగులను తరలించి అంబులెన్స్‌లకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

కోబ్రా, జార్ఖండ్ పోలీసులు కుట్రపూరితంగా బూటకపు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, ERB సభ్యుడు కామ్రేడ్ సహదేవ్ సోరెన్ అలియాస్ అనుజ్, బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు కామ్రేడ్ కామ్రేడ్ రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చంచల్, జోనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ రామ్‌ఖేలవన్ గంజు అలియాస్ వీర్సేన్‌లను దారుణంగా హత్య చేయడం, సెప్టెంబర్ 7, 2025న పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ చంద్రహంస్‌ అలియాస్ అమిత్ అలియాస్ అప్టన్‌ హత్య సెప్టెంబర్ 13, 2025న కామ్రేడ్ నీలేష్ అలియాస్ అరుణ్‌ను గాయపడిన స్థితిలో పట్టుకుని, క్రూరంగా చంపడం; కామ్రేడ్ జైకాంత్, గురు చరణ్, బాస్మతిని పట్టుకుని నిర్బంధించడం వంటి రాజ్యాంగ విరుద్ధమైన పోలీసు చర్యలకు నిరసనగా తూర్పు ప్రాంతీయ బ్యూరో, అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 14 వరకు ప్రతిఘటన వారోత్సవం, అక్టోబర్‌ 15న ఒక రోజు బంద్‌ కు విజ్ఞప్తి చేస్తూ తదితర అంశాలతో ప్రకటన జారీ చేసింది.