J SURENDER KUMAR,
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగిన చండీ యాగంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద మంత్రి ప్రత్యేక పూజలు చేసి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం, నవగ్రాహా హోమం, మహా చండీ యాగం లో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు,
👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

లోక మాత శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు, అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.