ధర్మపురి ఆలయానికి చెందిన విలువైన కాపర్ వైర్ మాయం ?

J SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువైన బోర్వెల్, కాపర్ వైర్ మాయమైంది. ఈ అంశంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారో ? అంతర్గతంగా విచారణ చేస్తున్నారో ? అనే విషయం స్పష్టత  లేదు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మపురి ఆలయ కు చెందిన పుట్ట బంగారం స్థలం ( కూరగాయల మార్కెట్ దగ్గర) ఆలయ నిధులతో బోర్ బావిని, విద్యుత్తు మోటార్ తో సహా అమర్చారు. జాతరకు ఒక రోజున ముందు స్వామి వారు ఊరేగింపుగా ఇక్కడికి వస్తారు, స్వామివారాలకు ఇక్కడ, అర్చకులు, వేద పండితులు,  ఘనంగా ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇక్కడ చెడిపోయిన బోర్ బావి లో మోటర్ మరమ్మత్తుల కోసం గత కొన్ని రోజుల క్రితం ఆలయ అధికారులు, సిబ్బంది సమక్షంలో కాపర్ వైర్ తో సహా మోటర్ ను వెలికి తీశారు. మోటార్ మరమత్తు కాకపోవడంతో వైర్ తో సహా అక్కడే వదిలేశారు. దాదాపు లక్షకు పైగా విలువ గల కాపర్ వైర్ మాయం అయినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.