ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి !

👉 జిల్లాకు 10775  ఇండ్లు మంజూరు..

👉 ఒకే ఒక్క ఇల్లు పూర్తయింది…

👉  7261 ఇళ్లకు మార్కౌట్ ….

👉 2569 ఇళ్లకు బేస్మెంట్ స్థాయిలో …

👉 428 ఇళ్లకు గోడల నిర్మాణం వరకు …

👉 165 ఇళ్లకు స్లాబ్ దశలో…

J.SURENDER KUMAR,

శుక్రవారం జగిత్యాల జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ, క్లస్టర్ అధికారులు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్షించారు.

సమీక్షలో  గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వివరాలను కలెక్టర్ కు అధికారులు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 10775 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 7261 మార్కౌట్ చేయగా 2569 బేస్మెంట్ స్థాయిలో 428 గోడల నిర్మాణం వరకు 165 స్లాబ్ దశకు రాగ ఒక ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుందని కలెక్టర్ కు అధికారులు తెలిపారు.


ఇందిరమ్మ ఇండ్లు పనులు పూర్తయిన సమాచారం ఆన్లైన్ లైన్ లోపొందుపరచాలని అధికారులను ఆదేశించారు. క్లస్టర్ వారిగా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. పనులలో సమస్యల గురించి అడిగి తెలుసుకుని తగిన కలెక్టర్ సూచనలు చేశారు.

ఇందిరమ్మ కమిటీలను సమన్వయం చేసుకుంటూ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరారు. నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు తెలుపాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై పనులు ప్రారంభించనట్లయితే అర్హులైన ఇతరులకు ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.

జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ నుండి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక లభిస్తుందని అవసరమైన లబ్ధిదారులకు ఇసుక బజారు గురించి వివరించి నిర్మాణాలకు ఉచిత ఇసుక పొందేలా సూచించాలని తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన పరిధిలోనే 400-600 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు తెలపాలన్నారు. బిల్లుల్లో జాప్యం, ఇతర సమస్యలుంటే పంచాయతీ కార్యదర్శుల ద్వారా నివృత్తి చేసుకోవాలని  తెలిపారు. మేస్త్రి, కూలీల కొరత లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అవగాహనా  కల్పించాలన్నారు.


గ్రామాల్లోని లబ్ధిదారుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకొని నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపెల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్, శ్రీనివాస్,  హోసింగ్ పిడి ప్రసాద్, డిపివో మదన్మోహన్, ఎంపిడివో లు, ఎంపివో లు,  క్లస్టర్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.