మంథని నియోజకవర్గ రోడ్లకు ₹10 కోట్ల నిధులు !

👉 మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు !


J SURENDER KUMAR,

మంథని నియోజకవర్గములోని  గిరిజన గ్రామాల అనుసంధానం (ట్రైబల్ కనెక్టివిటీకి) రోడ్లకు ₹10 కోట్ల 66 లక్షల నిధులు ప్రభుత్వం  మంజూరు చేసిందని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


👉 గిరిజన గ్రామాలకు సంబంధించిన కనెక్టివిటీ (అనుసంధానం) రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలు మంత్రి  పంపించారు. వాటిలో  ప్రస్తుతానికి 3 బిటి రోడ్ల కు నిధులు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

👉 కాటారం మండలం – బీటి రోడ్డు 4.20 కిలోమీటర్లు – దేవరంపల్లి టు ఎడ్లపల్లి రోడ్ –  అంచనా విలువ  ₹4 .45  కోట్లు  30వేలు !


👉 మహా ముత్తారం మండలం బిటి రోడ్  – ఎర్రం టు నర్సింగాపూర్ ఎక్స్ రోడ్ వయా మీనాజీపేట – రెండు కిలోమీటర్లు
అంచనా విలువ ₹ 1 కోటి 96 లక్షల 52వేలు!


👉 మహా ముత్తారం మండలం  బిటి రోడ్  – ప్రేమ్ నగర్ టు నందిగామ మహా ముత్తారం  – 4.80 కిలోమీటర్లు
అంచనా విలువ ₹ 4 కోట్ల 24 లక్షల 90వేలు


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు !

కాటారం, మహా ముత్తారం, గిరిజన గ్రామాలకు సంబంధించిన 3 బిట్ రోడ్లు మంజూరుకు ₹10 కోట్ల 66 లక్షలు 72వేలు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్మం త్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు
మాహ ముత్తారం, కాటారం మండలల ప్రజలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రకటనలలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.