👉 ట్రాన్స్జెండర్లకు ఆత్మగౌరవ జీవితం కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
గతంలో రైల్వే స్టేషన్ ల ముందు, స్టేషన్లలో ప్రయాణికులను యాచిస్తూ, జీవనం కొనసాగించే ట్రాన్స్జెండర్లకు ప్రయాణికుల, చీదరింపులు, ఈ సడింపులతో, ఏమిటి మా జీవితం, అనే మానసిక అవమాన భారంతో వెలివేయబడ్డ ట్రైన్ జెండర్లే నేడు ఆత్మగౌరవంతో యాచించిన రైల్వే స్టేషన్లలోనే ప్రయాణికుల భద్రత బాధ్యతలను బాధ్యతాయుతంగా శాసించే స్థాయి ఉపాధి ఆకాశం కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం కల్పించి వారికి ఆత్మగౌరవ బ్రతుకు బాటకు బాటలు వేసింది.
👉 “ట్రాన్స్జెండర్లు తక్కువ వారుకాదు, వారు తలెత్తుకుని బ్రతికే వారు, అని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల ఫలితంగా ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా మంత్రి అన్నారు.
👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్, చాంబర్ లో 20 మంది ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా మంత్రి నియామక పత్రాలు అందించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

సెక్యూరిటీ గార్డుల నియామకాల కోసం దాదాపు మూడు, నాలుగు వందల మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి , మీరు ఆత్మగౌరంతో జీవించాలని సీఎం సంకల్పమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 “మీరు సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించాం. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్జెండర్లకు కూడా తలెత్తే భవిష్యత్తు ఏర్పడుతుంది, మీరు ఈ సమాజంలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి” అని మంత్రి ఉద్బోధించారు.

👉 ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
👉 మహిళా, శిశు సంక్షేమ, ఎస్సీ డెవలప్మెంట్ విభాగం సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీమతి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ…
👉 “ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లను తక్కువ చేసి చూశారు. ఇప్పుడు అదే సమాజం అంగీకరించే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక చిన్న అడుగుతో గొప్ప మార్పు సాధ్యం అవుతుంది. మీరు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు మీకే వస్తుంది” అని అన్నారు.
👉 ప్రభుత్వం ఇప్పటికే ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ గదులు, మైత్రి క్లినిక్ల ద్వారా మానసిక సహాయం, గుర్తింపు కార్డులు, స్కిల్ డెవలప్మెంట్, బ్యాంకు లింకేజీ లేకుండా ఆర్థిక సహాయం వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు.

👉 గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ట్రాన్స్జెండర్ల సేవలకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ నియామకాలు ప్రైవేట్, పబ్లిక్ రంగాలపై ప్రభావం చూపి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని అన్నారు.
👉 “బాధితులు” అన్న ముద్ర నుండి “భాగస్వాములు” అనే గౌరవప్రదమైన స్థాయికి తీసుకెళ్తున్నాయి ఈ నియామకాలు. ఇది ఉద్యోగం మాత్రమే కాదు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, సమాజంలో నిలబెట్టే జీవితం వైపు తీసుకెళ్లే విప్లవాత్మక అడుగు అని ఒక ట్రాన్స్జెండర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శైలజ, ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులు గిరిజష్ పాండే, ట్రాన్స్జెండర్లకు యూనిఫామ్లను స్పాన్సర్ చేసిన దీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ముకుంద మాల, మౌంట్ ఫాంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ వర్గీస్ తెక్కనాథ్, ట్రాన్స్ వెల్ఫేర్ ఫౌండర్ వాసవి తదితరులు పాల్గొన్నారు.