మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి రెండు నూతన సంక్షేమ పథకాలు !

👉 నూతన పథకాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ లో మైనారిటీల సంక్షేమం కోసం ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మారో రెండు నూతన సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లాంచనంగా ప్రారంభించారు.

👉 “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”,

👉“రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం”

పేరుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కు సంబంధించిన పోర్టల్ ను  ఏర్పాటు చేసినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.  ఈ రెండు సంక్షేమ పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి  పిలుపునిచ్చారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…

ఈ సంక్షేమ పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి” అని మంత్రి అన్నారు.

👉 “వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిరు వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుంది” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 “ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం తో  వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని” అని మంత్రి  అన్నారు.

👉 “సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి, వెంటనే అమలు చేసే నాయకుడు. ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వెలువడ్డాయి” అని మంత్రి పేర్కొన్నారు.

👉 “ రెండు సంక్షేమ పథకాలకే ప్రభుత్వం ₹ 30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల సీఎం అంకితభావానికి నిదర్శనం” అని అన్నారు.

👉 “నేను మంత్రి గా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలు పూర్తి అయిన  కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని” మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 “ అర్హులైన లబ్ధిదారులు ఈ ఆర్థిక సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలనీ మంత్రి విజ్ఞప్తి చేశారు.

👉 “మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు, వారిని స్వయం ఉపాధికి మార్గ నిర్దేశం చేయడం మా లక్ష్యం” అని మంత్రి స్పష్టం చేశారు.

👉 “ఈ సంక్షేమ పథకాలు కుటుంబ పోషణకు తోడ్పడటమే కాకుండా, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయి” అని మంత్రి అన్నారు.

👉 “చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే, వారిలోని యువతకు చదువులోనూ, ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు.

👉 “కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడమే మా ప్రభుత్వ సంకల్పం” అని స్పష్టం చేశారు.

👉 “ఈ సంక్షేమ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదు, మైనారిటీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాది” అని అన్నారు.

👉 “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో  మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తాం” మంత్రి లక్ష్మణ్ కుమార్  హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి, TGMFC వీసీ & ఎం.డి కాంతి వెస్లీ IAS, షఫియుల్లా IFS, AGM కె. పెర్సిస్, రీజినల్ అధికారి ప్రవీణ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.