👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
గురువారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను మంత్రి పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…

బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా పోషణ మాసం కార్యక్రమ చేపట్టడం జరిగిందన్నారు. మరొకటి పేద వాడి సొంతింటి కల నెరవేర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకుకు వచ్చి అర్హులైన లబ్ధిదారులకు నేడు మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.
👉 ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, అట్టి జాబితా ను గెజిటెడ్ అధికారులతో విచారణ నిర్వహించి నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజక వర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ళు మంజూరు అయ్యాయని తెలిపారు.
👉 ప్రతి సంవత్సరం 3500 ఇళ్ళు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు.

👉 గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు అందించలేదని తెలిపారు. మంజూరు అయిన ఇళ్లకు ₹ 5 లక్షలతో నిర్మాణము జరుగుతుందని,
4 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమ వారం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
👉 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే సిమెంట్ కూడా తక్కువ దరకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

👉 అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు ₹ 20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. రైతు ఋణ మాఫీ, విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఒక ఇళ్లు నిర్మిస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్లుగా నిలిచిపోతమని మంత్రి తెలిపారు.
👉 పేదోళ్లకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు సేవలు చేయాలని ప్రజలను మన్ననలు పొందాలని తెలిపారు.
👉 నిర్మాణంలో జాప్యం లేకుండా ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని, ఇల్లు నిర్మాణం ఆగిపోతే ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తానని మంత్రి స్పష్టం చేశారు.

👉 ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వ అధికారులు గానీ ఇతరులు ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు అడిగితే పోలీస్ కేసు నమోదు చేయాలని సూచించారు.
👉 మీ ఆశలను నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిర ఇల్లు మంజూరు చేసిందని మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఇల్లు నిర్మాణంతో సంతోషంగా ఉండాలని, మనం మనం గుర్తుకు రావాలని ఆయన సూచించారు
👉 కలెక్టర్ మాట్లాడుతూ…..

నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గెజిటెడ్ అధికారులతో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. A I ద్వారా కూడా విచారణ చేపట్టామని తెలిపారు. లబ్ధిదారులు ఫోటో దిగిన చోట మాత్రమే ఇళ్లు నిర్మాణం చేపట్టాలని, 4 విడతలుగా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు.
👉 లబ్ధిదారులు త్వరిత గతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణీ లకు సీమంతం, కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,
గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, మహిళా, శిశు సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, మిషన్ భగీరథ ఈఈ శ్వేతా, మహాదేవపూర్ సింగిల్ విండో ఛైర్మన్ తిరుపతి రెడ్డి, సీడీపీఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.