ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలి !

👉 స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్  పై జిల్లా కలెక్టర్లతో సమీక్ష !

👉 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి !

J SURENDER KUMAR,

ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  అన్నారు.స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్  పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఈ దూర దృష్ట్యా మాద్యమం లో పాల్గోన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ….

ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్  డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.

ఎస్.ఐ.ఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు.  బీహార్, మహారాష్ట్ర  వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు,  బి.ఎల్.ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని  ఎస్.ఐ.ఆర్ చేపట్టేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్టుపెల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్, శ్రీనివాస్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.