సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!


J SURENDER KUMAR,

హైదరాబాద్ అంబర్‌పేట్ వద్ద నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. వీటికి తోడు మురుగునీటి శుద్ధి కోసం ₹ 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు.

👉 ₹ 539.23 కోట్లతో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆరు STP ప్లాంట్లను ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌  ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి  అంబర్‌పేట ఎస్టీపీని పరిశీలించారు.

👉 సీఎం  ప్రారంభించిన ఎస్టీపీల వివరాలు:

1. అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో (₹319.43 కోట్లు) 212.50 MLD సామర్థ్యం కలిగిన అంబర్‌పేట్ ఎస్టీపీ.

2. రాజేంద్రనగర్ పరిధిలో (₹109.24 కోట్లు) నిర్మించిన 64 MLD సామర్థ్యం గల అత్తాపూర్ ఎస్టీపీ.

3. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో (₹ 44.46 కోట్లు) నిర్మించిన 25 MLD సామర్థ్యం గల ముల్లకతువా ఎస్టీపీ.

4. కుత్బుల్లాపూర్ పరిధిలో (₹ 34.13 కోట్లు) నిర్మించిన 14 MLD సామర్థ్యం గల శివాలయ నగర్ ఎస్టీపీ.

5. కుత్బుల్లాపూర్ పరిధిలో ( ₹ 13 కోట్లు) నిర్మించిన 10 MLD సామర్థ్యం గల వెన్నలగడ్డ ఎస్టీపీ.

6. ⁠శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో (₹18.97 కోట్లు) నిర్మించిన 07 MLD సామర్థ్యం గల పాలపిట్ట ఎస్టీపీ.

👉 వీటికి తోడుగా మురుగునీటి శుద్ధి కోసం ₹ 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 STP లకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు.


1)  ₹1878.55 కోట్లతో ప్యాకేజీ-1 లో 16 ఎస్టీపీలు.

2)  ₹ 1906.44 కోట్లతో ప్యాకేజీ-2 లో 22 ఎస్టీపీలు.

3)  ₹ 64.11 కోట్లతో PPP మోడల్‌లో ఒక ఎస్టీపీ లు.