👉 గణేష్ నిమజ్జనం వేడుకలకు..
J.SURENDER KUMAR,
ఎలాంటి హంగూ, ఆర్భాటం లేదు, ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది లేరు, జామర్ వాహనం లేదు, శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సింపుల్ గా సామాన్యుడిలా ట్యాంక్ బండ్ పైకి వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు.
👉 ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

👉 గణపతి బొప్పా… మోరియా.. అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మారుమోగుతున్న వేళ.. ముందస్తు సమాచారం లేకుండా అక్కడికి చేరుకున్న సీఎంను భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు. ఉత్సవ కమిటీ అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి “గణపతి బప్పా మోరీయ ఆదా లడ్డు చోరియ ” అని తన ప్రసంగంలో నినాదలు చేస్తూ భక్త జనం ను ఉత్సాహపరిచారు.

👉 క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉదయం నుంచే శోభాయాత్ర ప్రారంభమై ఒక్కొక్కటిగా గణపతులు ట్యాంక్బండ్ తరులుతుండగా, సాయంత్రానికి మహా గణపతి శోభాయాత్ర ఊపందుకుంది. మహా జనంలో కలిసిపోయి సీఎం ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులతో కరచాలనం చేస్తూ నడిచారు.

👉 హుస్సేన్సాగర్లో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ (పీవీ మార్గ్) లో నిరాటంకంగా సాగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఎం సూచించారు.