J.SURENDER KUMAR,
గత కొంతకాలంగా జిల్లాలో పౌర సంబంధాల అధికారి పోస్టు ఖాళీగా ఉండగా శనివారం జెడ్పి డిప్యూటీ సీఈవో పల్లికొండ నరేష్ ను నూతన డిపిఆర్ఓ గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల టియుడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 రోజుల క్రితం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, సీనియర్ రిపోర్టర్ మదన్మోహన్, రాజు తదితరుల తో ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి డిపిఆర్ఓ ను నియమించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
జిల్లాలో పౌర సంబంధాల అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పత్రికల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని, అదేవిధంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు, ఇతర అధికారుల సమాచారం కూడా పాత్రికేయులకు సరైన సమయంలో
చేరడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు.
స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో కొత్త డి పి ఆర్ ఓ నియామకాన్ని చేపడుతామని హామీ ఇచ్చారన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నియామకం చేపట్టడం పట్ల టి యు డబ్ల్యూజే ప్రకటనలోహర్షం వ్యక్తం చేశారు.
👉 కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంచార్జి డిపిఆర్వో !
శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా ఇంచార్జి బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జెడ్పి డిప్యూటి సీఈవో పల్లికొండ నరేష్. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.